మహారాష్ట్రలో క్షణక్షణం మారుతున్న పరిణామాలు

మహారాష్ట్రలో క్షణక్షణం మారుతున్న పరిణామాలు
x
Highlights

మహారాష్ట్రలో క్షణక్షణం పరిణామాలు మారుతున్నాయి. ఈ మేరకు సోనియా నివాసంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల భేటీ ముగిసింది. మరోవైపు కాంగ్రెస్‌ నిర్ణయం కోసం...

మహారాష్ట్రలో క్షణక్షణం పరిణామాలు మారుతున్నాయి. ఈ మేరకు సోనియా నివాసంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల భేటీ ముగిసింది. మరోవైపు కాంగ్రెస్‌ నిర్ణయం కోసం ఎన్సీపీ ఎదురుచూస్తుండగా.. కాంగ్రెస్‌ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఒక సీఎం, రెండు డిప్యూటీ సీఎం పదవులపై తర్జభర్జన కొనసాగుతోంది. ఈవిషయంపై సోనియా సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. ఈ సాయంత్రం మరోసారి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే శివసేన సాయంత్రం ఆరు గంటల లోపు ప్రభుత్వ ఏర్పాటుకు సమ్మతి తెలుపనున్నట్టు సమాచారం. శరద్‌ పవార్‌, ఉద్ధవ్ థాక్రరే ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో సమావేశమయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories