గుజరాత్ లో కాంగ్రెస్‌కు షాక్‌.. ఐదుగురు ఎమ్మె‍ల్యేలు రాజీనామా

గుజరాత్ లో కాంగ్రెస్‌కు షాక్‌.. ఐదుగురు ఎమ్మె‍ల్యేలు రాజీనామా
x
Rahul Gandhi (file photo)
Highlights

ఇప్పటికే మధ్యప్రదేశ్ లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే మధ్యప్రదేశ్ లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికల వేళ ఆ పార్టీకి మరో భారీ షాక్‌ తగిలింది. గుజరాత్‌లో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఎమ్మెల్యేల రాజీనామా విషయాన్నీ స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను ఆదివారం అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్రత్రివేదికి ఇచ్చారు.

అయితే కాంగ్రెస్ అధిష్టానం వారిని బుజ్జగించే ప్రయత్నాలను రాష్ట్ర పెద్దలకు అప్పజెప్పినట్టు తెలుస్తోంది. వాస్తవానికి గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు మార్చి 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం సంచలంగా మారింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల పేర్లను సోమవారం ప్రకటిస్తామని స్పీకర్‌ రాజేంద్రత్రివేది తెలిపారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా రేపు గుజరాత్ లో రాజకీయంగా కీలక పరిమాణాలు చోటుచేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories