Balasore: బాలాసోర్‌లో కొనసాగుతున్న ట్రాక్‌ పునరుద్ధరణ పనులు..

Track Renovation Work Started in Balasore
x

Balasore: బాలాసోర్‌లో కొనసాగుతున్న ట్రాక్‌ పునరుద్ధరణ పనులు..

Highlights

Balasore: పునరుద్ధరణ పనులను పర్యవేక్షించిన రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌

Balasore: బాలాసోర్‌లో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. అయితే.. పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌. ప్రమాదానికి కారణం గుర్తించేపనిలో ఉన్నామని ఆయన చెప్పారు. మృతదేహాలన్నింటినీ వెలికితీశామని తెలిపారు. ఇవాళ ట్రాక్‌ పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు రైల్వే మంత్రి. ఇక.. ఇవాళ కూడా ఒడిశా మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు చేసినట్టు ఇప్పటికే రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మృతి చెందగా.. 17 వందల 75 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories