కరోనావైరస్ కు వ్యతిరేకంగా ఇది సుదీర్ఘ యుద్ధం : ప్రధాని మోదీ

కరోనావైరస్ కు వ్యతిరేకంగా ఇది సుదీర్ఘ యుద్ధం : ప్రధాని మోదీ
x
Narendra Modi (File Photo)
Highlights

కరోనావైరస్ కు వ్యతిరేకంగా ఇది సుదీర్ఘ యుద్ధమని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్నారు.

కరోనావైరస్ కు వ్యతిరేకంగా ఇది సుదీర్ఘ యుద్ధమని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్నారు. విజయం సాధించవలసి ఉన్నందున అలసిపోవద్దని లేదా విశ్రాంతి తీసుకోవద్దని పౌరులను ప్రోత్సహించారు. "ఇది కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా సుదీర్ఘ యుద్ధం అని నేను పూర్తి బాధ్యతతో చెప్తున్నాను. కానీ ఈ యుద్ధంలో మనం అలసిపోవాల్సిన అవసరం లేదు. మనం విజయవంతం కావాలి. ఈ రోజు, దేశానికి ఒకే లక్ష్యం మరియు ఒకే సంకల్పం ఉంది.. అదే ఈ 'యుద్ధంలో విజయం సాధించడం' అని బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

అలాగే ప్రధాని మాట్లాడుతూ.. క్లిష్టసమయాల్లో ఎలా ఉండాలో భారత్‌ ప్రపంచ దేశాలను దిశా నిర్ధేశం చేసిందని మోదీ అన్నారు. కరోనాపై వేగంగా స్పందించిన దేశాల్లో భారత్‌ ఒకటి, ఈ సమయం దేశానికి ఒక ఛాలెంజ్‌ లాంటిదన్నారు. కరోనాను తరిమి కొట్టడానికి అందరం ఒక్కటవుదామన్నారు. లాక్‌డౌన సమయంలో ప్రజలంతా సహకరించాలని, బయటకు ఎప్పుడు వెళ్లినా మాస్కులు ధరించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి కూడా కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుందన్నారు.

ఈ క్రమంలో భారతదేశం ప్రయత్నాలు ప్రపంచం ముందు ఒక ఉదాహరణగా నిలిచాయని ఆయన అన్నారు. ఈ దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో 120 కోట్ల మంది భారతీయులు చూపించిన పరిపక్వతను ప్రధాని ప్రశంసించారు. అంతేకాదు ఈ వ్యాధి యొక్క తీవ్రతను అర్థం చేసుకొని దానిపై సకాలంలో యుద్ధం చేసిన దేశాలలో ఇండియా ఒకటి. భారతదేశం అనేక నిర్ణయాలు తీసుకుంది.. వాటిని అమలు చేయడానికి ఉత్తమంగా ప్రయత్నించింది, "అని బిజెపి సభ్యులకు వీడియో కాల్ ద్వారా ప్రధాని సందేశమిచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories