పొంగల్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై.. పొంగల్ వండి అందరికీ పంచిన గవర్నర్ !
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి పండుగను...
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి పండుగను చెన్నైలో జరుపుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్ పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ తమిళనాడు - తెలంగాణకు మధ్య తాను వారధిలా ఉంటాను అని తెలిపారు. సుఖ సంతోషాలతో జరుపుకునే పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రాచీన, అద్భుత సంప్రదాయానికి సంక్రాంతి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై స్వయంగా పొంగల్ వండి అందరికీ పంచారు.
Tamil Nadu: Telangana Governor Tamilisai Soundararajan celebrates the festival of #Pongal with her family at her residence in Chennai. pic.twitter.com/WGIauFZMaB
— ANI (@ANI) January 14, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire