40 ఏళ్లుగా సైకిల్‌పై తిరుమలకు వస్తున్న తమిళనాడు భక్తుడు శక్తిదాసన్

Tirumala Devotee: సమాజంలో శాంతిని ఆకాంక్షిస్తూ తిరుమలకు సైకిల్ యాత్ర...

Shireesha
Published on: 26 Dec 2021 11:34 AM IST
Tamil Nadu Shaktidasan Devotee of Tirumala comes to Tirupati by Cycle From 40 Years | Telugu Online News
X

40 ఏళ్లుగా సైకిల్‌పై తిరుమలకు వస్తున్న తమిళనాడు భక్తుడు శక్తిదాసన్

Tirumala Devotee: శ్రీవారిని దర్శించుకోవాలన్న తపనతో 300 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి తిరుమల క్షేత్రానికి చేరుకున్నాడో భక్తుడు. సమాజంలో శాంతిని ఆకాంక్షిస్తూ ఒకటి, రెండు కాదు దాదాపు నలభై సంవత్సరాలుగా సైకిల్‌పై తిరుమలకు వస్తున్నాడు ఆ భక్తుడు.

60 సంవత్సరాల శక్తిదాసన్తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన శ్రీపాదం అరుళ్‌మళై ఆశ్రమ పీఠాధిపతి, 60 యేళ్ళ వయస్సున్న ఇతను, ప్రతి ఏడాది ధనుర్మాసంలో తన స్వస్థలం నుండి సైకిల్‌పై వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సైకిల్‌పై దాదాపు 300 కిలో మీటర్లకు పైగా ప్రయాణించి తిరుపతికి చేరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.

Shireesha

Shireesha

Next Story