Supreme Court: ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court: పంట వ్యర్థాల దహనాన్ని వెంటనే ఆపాలని ఆదేశం

Jyothi
Published on: 7 Nov 2023 3:23 PM IST
Supreme Court Hearing on Delhi Air Pollution
X

Supreme Court: ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court: ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనాన్ని వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్‌లకు ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు.. 4 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు రేపు సమావేశం నిర్వహించాలని తెలిపింది. పంట వ్యర్థాల దహనాన్ని వెంటనే ఆపాలని.. కొన్నిసార్లు బలవంతపు చర్యల ద్వారా.. కొన్నిసార్లు ప్రోత్సాహకాల ద్వారా వీటిని ఆపాల్సిన పరిస్థితి అవసరం అన్నారు. ఇవాళ్టి నుండి పంట వ్యర్ధాల దహనాన్ని ఆపే పనిని ప్రారంభించాలని సూచించారు.

Jyothi

Jyothi

Next Story