అయ్యప్ప స్వాముల బృందం వెంట 480 కి.మీ వెళ్లిన శునకం

stray dog  following a group of ayyappa devotees
x
stray dog following a group of ayyappa devotees
Highlights

-అయ్యప్ప స్వాముల బృందానికి ఓ విచిత్రమైన ఘటన -శునకాన్ని గమనించలేదన్న స్వాములు

చిత్తూరు జిల్లా తిరుమల నుంచి బయల్దేరిన అయ్యప్ప స్వాముల బృందానికి ఓ విచిత్రమైన ఘటన ఎదురైంది. తిరుమల నుండి వారిని ఓ శునకం అనుసరిస్తోంది. ప్రస్తుతం వారు 480కిలో మీటర్ల నడిచి కర్ణాటకలోని చిక్‌మగుళూరు జిల్లా కొట్టిగెహరకు చేరుకున్నారు. కేరళలోని శబరిమలకు కాలినడకన చేరుకోవాలని 13 మందితో కూడిన అయ్యప్ప భక్తుల బృందం అక్టోబరు 31న తిరుమల నుంచి బయల్దేరింది. అక్కడి నుంచే ఆ శునకం వారిని అనుసరించడం మొదలు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

తాము పాదయాత్రలో నిమగ్నమై ఉన్నామని.. మొదట శునకాన్ని గమనించలేదన్నారు స్వాములు. దాన్ని ఏమీ అనలేక తమకోసం తయారు చేసుకున్న భోజనంలో కొంత దానికి కూడా పెడుతున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాగే యాత్రకు వెళుతున్నా ఈ సారి మాత్రం కొత్త అనుభూతి కలుగుతోందన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories