దారుణం : కూతురిపట్ల రాక్షసుడిగా మారిన సవతి తండ్రి..

దారుణం : కూతురిపట్ల రాక్షసుడిగా మారిన సవతి తండ్రి..
x
Highlights

కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి.. ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బెమెతారా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పార్పోండి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారం చేశాడు.

కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి.. ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బెమెతారా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పార్పోండి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారం చేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు తండ్రి బాలికను చంపేస్తానని బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక ఈ విషయాన్నీ తన తల్లికి చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసులు నిందితుడు సవతి తండ్రిని అరెస్టు చేశారు. బుధవారం రాత్రి నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి నిందితుడు తాగి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం భార్యతో గొడవ పెట్టుకున్నాడు..

ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్త ప్రవర్తనపై కలత చెందిన భార్య.. పొరుగు ఇంట్లో నిద్రించడానికి వెళ్ళింది. ఇదే అవకాశంగా భావించిన నిందితుడు కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఏడ్చుకుంటూ తన తల్లికి చెప్పడంతో గురువారం ఉదయం, తల్లి-కుమార్తె కొట్వర్ మరియు గ్రామ సర్పంచ్ తో కలిసి వెళ్లి ఫిర్యాదు చేశారు. దాంతో నిందితుని అరెస్ట్ చేశారు.. అనంతరం చికిత్స కోసం ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. కాగా బాలికకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె తండ్రి చనిపోయాడు.. దాంతో నిందితుడు ఆమె తల్లిని వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లపాటు సజావుగానే వీరి కాపురం సాగింది..

అయితే ఆ తరువాత అతను మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు, నిత్యం మద్యం సేవించందే ఇంటికి వచ్చేవాడు కాదు. ఇల్లు గడవడం కోసం అతని భార్య కూలి పనులకు వెళ్ళేది. ఆ డబ్బులను కూడా బలవంతంగా లాక్కొని మద్యం సేవించేవాడు. ఎవరు ఎదురుతిరిగినా వారిపై దాడికి పాల్పడేవాడు.. తన భార్యపై చాలా సార్లు తీవ్ర దాడికి పాల్పడ్డాడు. ఇదిలావుంటే బాలికపై అత్యాచారం జరిగిందని పార్పోండి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సిఆర్ ఠాకూర్ తెలిపారు. మెడికల్ చెకప్ కోసం ఆమెను బెమెతారాకు పంపించామని తెలిపారు. ప్రస్తుతం బాలికకు చికిత్స చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories