Honeymoon Murder: భర్త హత్య తరువాత ప్రియుడిని అద్దె గదిలో కలిసిన సోనమ్ ..

సోనమ్ రాఘువంశీ ప్రేమకు బలి అయిన పెళ్లి: భర్త హత్య తరువాత ప్రియుడిని కలవడానికి మళ్లీ మద్యప్రదేశ్ చేరిన

Ramya Vegirouthu
Updated on: 11 Jun 2025 11:31 AM IST
Honeymoon Murder: భర్త హత్య తరువాత ప్రియుడిని అద్దె గదిలో కలిసిన సోనమ్ ..
X

Honeymoon Murder: భర్త హత్య తరువాత ప్రియుడిని అద్దె గదిలో కలిసిన సోనమ్ .. 

Honeymoon Murder: సోనమ్ రాఘువంశీ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్‌కి చెందిన సోనమ్ ఇటీవల తన భర్త రాజా రాఘువంశీని మేఘాలయలో హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమె ఈ హత్యలో తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్రణాళిక తయారు చేసినట్లు తేలింది.

వివాహం జరిగిన కేవలం కొద్దిరోజులకే సోనమ్ తన భర్తను హనీమూన్‌ పేరుతో మేఘాలయ తీసుకెళ్లింది. అక్కడే చర్రాపున్జీ ప్రాంతంలో రాజాను చంపేలా ప్లాన్ చేసింది. హత్య అనంతరం ఆమె అక్కడి నుంచి తిరిగి మధ్యప్రదేశ్‌కి వచ్చింది. తర్వాత మరోసారి తన ప్రియుడిని కలవడానికి ఉత్తరప్రదేశ్‌ వెళ్లింది. ఈ క్రమంలో ఆమె ప్రయాణించిన దారులు, టికెట్లు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిజాలను వెలికితీశారు.

ఇటీవల సోనమ్‌ను మేఘాలయ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మూడో వ్యక్తి గుల్ అనే వ్యక్తి కూడా ప్రమేయం ఉన్నట్లు సమాచారం. సోనమ్‌ను విచారించిన పోలీసులు ఆమెకు మరిన్ని మోసపూరిత సంబంధాలు ఉన్నట్లు గమనించారు. కుటుంబం మాత్రం ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తోంది. కానీ విచారణలో బయటపడుతున్న నిజాలు ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి.

ఇది కేవలం హత్య కేసు కాదు, ప్రేమ పేరుతో జరిగిన మోసం, నమ్మక ద్రోహానికి ఉదాహరణగా మారింది. సోనమ్ ప్రవర్తనపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కేసు ప్రస్తుతం కోర్టు విచారణ దశలో ఉంది.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story