కేంద్ర మంత్రివర్గ సమావేశం : సామాజిక దూరాన్ని పాటించిన మంత్రులు

కేంద్ర మంత్రివర్గ సమావేశం : సామాజిక దూరాన్ని పాటించిన మంత్రులు
x
union cabinet meeting
Highlights

ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది.

ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సందర్బంగా ప్రధాని సహా మంత్రులందరూ సామాజిక దూరం పాటించారు. సమావేశంలో ప్రధానంగా కరోనా వైరస్ నివారణ, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ , అలాగే నిత్యావసర సరుకుల పంపిణీపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశానికి కేవలం కొందరు మంత్రులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన మంత్రులు కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా పరిస్థితులను సమీక్షించేందుకు వారి స్వరాష్ట్రాలలోనే ఉన్నారు.

కేవలం 25 మంది మంత్రులు మాత్రమే సమావేశానికి అందుబాటులో ఉండి హాజరయ్యారు. కాగా నిన్న సాయంత్రం దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. ఈ వ్యాధిని విచ్ఛిన్నం చేయడానికి కనీసం 21 రోజుల నిర్బంధం అవసరమని చెప్పారు. అలాగే కరోనావైరస్ ను ఎదుర్కోవటానికి సామాజిక దూరాన్ని కొనసాగించాల్సి ఉందని.. ఇది ప్రధాని నుంచి సామాన్యుడు వరకూ అందరూ పాటించాలని సూచించారు. మరోవైపు ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ కొనసాగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories