New Delhi: ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జీలకు స్వైన్‌ ఫ్లూ

New Delhi: ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జీలకు స్వైన్‌ ఫ్లూ
x
sc File Photo
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది. సుప్రీంకోర్టుకు చెందిన ఆరుగురు న్యాయమూర్తులకు ప్రాణాంతక మైన హెచ్‌1ఎన్‌1 (స్వైన్‌ప్లూ) వైరస్‌ సోకింది.

దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది. సుప్రీంకోర్టుకు చెందిన ఆరుగురు జడ్జీులకు ప్రాణాంతక మైన హెచ్‌1ఎన్‌1 (స్వైన్‌ప్లూ) వైరస్‌ సోకింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేతో అత్యవసరంగా సమావేశమయ్యారు. స్వైన్‌ ప్లూ వ్యాప్తి చెందుతున్న వైనంపై సమీక్ష నిర్వహించారు. స్వైన్‌ ఫ్లూ సుప్రీంకోర్టులో పనిచేసే మిగత వారికి రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సీజేఐని కోరినట్లు జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులలో ముందు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయాలని సీజేఐ కోరామని చెప్పారు. అలాగే సర్వోన్నత న్యాయస్థానంలో పనిచేసే వ్యక్తులపై టీకాలు వేయడానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు.

అలాగే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రధాన న్యాయమూర్తి దుష్యంత్ దేవ్‌తో కూడా సమావేశమయ్యారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి దుష్యంత్ దేవ్‌ మాట్లాడాతూ.. స్వైన్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తిపై బాబ్డే చాలా విచారం వ్యక్తం చేశారు. కాగా.. కశ్మీర్‌, బెంగళూరు నగరాల్లో స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదైయ్యాయి. తాజా ఈ వైరస్‌ ఢిల్లీ మొత్తం విస్తరించింది. బెంగళూరుకు చెందిన సాప్ ఇండియా సంస్థ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయాల్సిందిగా సూచించింది. ఉద్యోగుల్లో ఇద్దరికి హెచ్1ఎన్1 స్వైన్‌ ఫ్లూ వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories