అక్టోబర్ 5 వరకు విద్యాసంస్థలు తెరవొద్దు..

అక్టోబర్ 5 వరకు విద్యాసంస్థలు తెరవొద్దు..
x
Highlights

కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలు అక్టోబర్ 5 వరకు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే, ఆన్‌లైన్ బోధన మరియు అభ్యాస కార్యకలాపాలు..

కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలు అక్టోబర్ 5 వరకు మూసివేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే, ఆన్‌లైన్ బోధన మరియు అభ్యాస కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి అని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (DoE) జారీ చేసిన అధికారిక ఉత్తర్వు తెలిపింది. జూన్ 8 నుండి మొదటి 'అన్‌లాక్' లో వివిధ దశలలో అనేక ఆంక్షలు సడలించగా, విద్యాసంస్థలపై ఆంక్షలు అలాగే కొనసాగాయి.

అయితే 'అన్‌లాక్' 4.0 కింద తాజా మార్గదర్శకాల ప్రకారం, పాఠశాలలు 9 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు సెప్టెంబర్ 21 నుండి విద్యార్థులను స్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాలలకు అనుమతించింది కేంద్ర ప్రభుత్వం.. కానీ కేంద్రం ఇచ్చిన సడలింపును ఢిల్లీ ప్రభుత్వం పక్కనపెట్టేసి.. అక్టోబర్ 5 వరకు విద్యాసంస్థలను తెరవవద్దని ఆదేశాలు ఇచ్చింది. కాగా కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యలలో భాగంగా దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు మరియు పాఠశాలలను మార్చి 16 నుండే మూసివేశారు. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories