బాలురతో ఆ ప్రతిజ్ఞ చేయిస్తాం : కేజ్రీవాల్‌

బాలురతో ఆ ప్రతిజ్ఞ చేయిస్తాం : కేజ్రీవాల్‌
x
kejriwal
Highlights

ప్రస్తుతం మన దేశంలో మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దాడుల గురించి మనకు తెలిసిందే.

ప్రస్తుతం మన దేశంలో మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దాడుల గురించి మనకు తెలిసిందే. ఈ నేపద్యంలో వీటిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం మాత్రం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు మానవత్వంతో మెలిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

ఈ నేపద్యంలో బాలురతో బాలికలపైన ఎప్పుడూ కూడా అసభ్యకరంగా ప్రవర్తించమని ప్రతిజ్ఞ చేయించాలని నిర్ణయించామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్‌ ఫిక్కీ మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో అమలు చేస్తామన్నారు. ఇక తమ పిల్లలపట్ల తల్లితండ్రులు కూడా శ్రద్ద పెట్టాలని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories