ఇవాళ అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ

అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. 60 ఏళ్లుగా ఎటూ తేలకుండా సాగుతున్న అయోధ్యలోని రామ...
అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. 60 ఏళ్లుగా ఎటూ తేలకుండా సాగుతున్న అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు గతంలో ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ను నియమించింది. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, లాయర్ శ్రీరామ్ పంచు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఖలీపుల్లాలను మధ్యవర్తులుగా నియమించింది. వీరు వివిధ రకాలుగా చర్చలు జరిపారు. ఈ మధ్యవర్తిత్వ కమిటీ సీల్డ్ కవర్లో తమ నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది.
దీంతో మధ్యవర్తిత్వం ఫలితంపై ఇవాళ సుప్రీం కోర్టులోనే అయోద్యంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలు జరుగుతున్న వేళా ఇది సున్నితమైన కేసు కాబట్టి కమిటీ నివేదికలోని అంశాలు బహిర్గతం చేయలేదు. ఈ నెల 6న సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది మధ్యవర్తిత్వ కమిటీ. దీంతో నాలుగు రోజుల అనంతరం దీనిపై విచారణ జరుగుతోంది. ఇక ఈ కేసుపై ఏమి తేలుతుందో అని దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT