Delhi: ఢిల్లీలో బీభత్సం సృష్టించిన బస్సు.. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

Road Accident in Delhi
x

ఢిల్లీలో బీభత్సం సృష్టించిన బస్సు..ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

Highlights

Delhi: అదుపుతప్పి వాహనాలను ఢీకొన్న బస్సు

Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణిలో బస్సు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు... పలు వాహనాలను ఢీకొనడంతో నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు రోడ్డు పక్కన ఉన్న బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనాలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బస్సు అదుపు తప్పడంపై గల కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories