Indian Railways: రైల్వే కీలక నిర్ణయం.. ఇప్పుడు తక్కువ ధరలో ప్రయాణించవచ్చు..!

Railways key decision passengers can again travel in general coaches
x

Indian Railways: రైల్వే కీలక నిర్ణయం.. ఇప్పుడు తక్కువ ధరలో ప్రయాణించవచ్చు..!

Highlights

Indian Railways: రైల్వే కీలక నిర్ణయం.. ఇప్పుడు తక్కువ ధరలో ప్రయాణించవచ్చు..!

Indian Railways: ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నిరంతరం తగ్గుతున్న కరోనా కేసుల తరువాత DGCA మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమానాలను ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు చాలా కాలం తర్వాత రైళ్లలో అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

రైల్వేశాఖ ఈ చర్యతో ప్రయాణికులు చౌకగా ప్రయాణం చేయగలుగుతారు. వాస్తవానికి దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా 23 మార్చి 2020 నుంచి అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లను తొలగించాలని నిర్ణయించారు. వాస్తవానికి రైల్వేలో ఈ కోచ్‌లని ఏర్పాటు చేసిన తర్వాతే ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకోకుండా ప్రయాణించగలుగుతున్నారు. దీని కారణంగా ప్రయాణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.

ఈ మార్పు తర్వాత ప్రయాణికులు స్టేషన్‌కు వెళ్లి కౌంటర్‌ నుంచి టికెట్ తీసుకొని వారి గమ్యస్థానానికి బయలుదేరుతారు. ఈ సదుపాయాన్ని ప్రారంభించిన తర్వాత సీనియర్ సిటిజన్లకు మునుపటిలా రాయితీ కూడా ఇస్తారు. అలాగే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. డిసెంబర్‌లో పెరుగుతున్న చలి, పొగమంచు కారణంగా యుపి, బీహార్, ఎంపి, జార్ఖండ్‌లకు వెళ్లే అనేక రైళ్లు రద్దు చేశారు. ఇప్పుడు ఈ రైళ్లను మార్చి 1 నుంచి మళ్లీ ప్రారంభించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories