ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు రివార్డు ఇస్తా

ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు రివార్డు ఇస్తా
x
రాహ్‌గ్రూప్ ఫౌండేషన్‌ చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌
Highlights

దిశ హత్య కేసులో నిందితులైన నలుగురిని శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు.

దిశ హత్య కేసులో నిందితులైన నలుగురిని శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా, నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలిసుల చర్యలను అభినందిస్తున్నారు.

అయితే హరియాణాకు చెందిన ఓ వ్యక్తి తెలంగాణ పోలీసులకు రివార్డు ప్రకటించరు. రాహ్‌గ్రూప్ ఫౌండేషన్‌ చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నానని తెలిపారు. అత్యాచారం చేసిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినందుకు తెలంగాణ పోలీసులకు రివార్డు ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ప్రతీ పోలీసుకు 1లక్ష రూపాయలు సంస్థ తరపున ఇస్తామని తెలిపారు. రాహ్‌ గ్రూప్‌ చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories