Priyanka Gandhi: వయనాడ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Participated In An Election Rally In Wayanad
x

Priyanka Gandhi: వయనాడ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక గాంధీ 

Highlights

Priyanka Gandhi: ప్రజల సమస్యలను మోడీ ఎక్కడా ప్రస్తావించడం లేదు

Priyanka Gandhi: లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రచారంలో ప్రధాని న‌రేంద్ర మోదీ స‌హా బీజేపీ నేత‌ల ప్రసంగాలు చూస్తుంటే అసంబద్ధమైన అంశాల‌ను లేవనెత్తడం క‌నిపిస్తుంద‌ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రజ‌ల‌కు సంబంధించిన‌ వాస్తవ అంశాల‌ను మ‌రుగున‌ప‌రిచేందుకు కాషాయ నేత‌లు ప్రయ‌త్నిస్తున్నార‌ని అన్నారు. కేర‌ళ‌లోని వ‌య‌నాద్‌లో జ‌రిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీ స‌హా బీజేపీ నేత‌లు ప్రజలు ఎదుర్కొనే స‌మ‌స్యల‌ను ఎన్నిక‌ల ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించడం లేద‌ని దుయ్యబ‌ట్టారు. రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగం, ధ‌ర‌ల మంట గురించి కాషాయ నేత‌లు అస‌లు నోరు మెద‌ప‌ర‌ని మండిప‌డ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories