హసీనా పట్టుదలే నాకు ప్రేరణ : ప్రియాంక

హసీనా పట్టుదలే నాకు ప్రేరణ : ప్రియాంక
x
Highlights

భారతలో పర్యటించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కలిశారు. షేక్ హసీనాతో కలిసి దిగిన ఫోటోను ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. సొంత వారిని కోల్పోయినా కష్టాలను అధిగమించడంలో హసీనా దైర్యం, నమ్మినదాని కోసం పట్టుదలతో పోరాటం చేయడం నాకు ప్రేరణగా నిలుస్తాయంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.

భారతలో పర్యటించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కలిశారు. షేక్ హసీనాతో కలిసి దిగిన ఫోటోను ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. సొంత వారిని కోల్పోయినా కష్టాలను అధిగమించడంలో హసీనా దైర్యం, నమ్మినదాని కోసం పట్టుదలతో పోరాటం చేయడం నాకు ప్రేరణగా నిలుస్తాయంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ బంగ్లాదేశ్ ప్రధాని హసీనాను గట్టిగా హత్తుకున్న ఫోటోను ట్వీట్టర్‎లో పోస్టు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. 1974లో హసినా భర్తతో పాటు జర్మనీలో నివాసం ఉంటుంది. అయితే అదే సమయంలో సైనిక తిరుగుబాటులో భాగంగా హసీనా తల్లిదండ్రులను, సోదరులను మిలిటరీ హత్య చేసిన విషయం తెలిసిందే.

శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక, వాణిజ్య అనుసంధానంతో సహాపలు కీలక అంశాలపై హసీనా చర్చించారు. ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ నుంచి ఎల్పీజీ పంపిణీ చేసేందుకు నిర్మించిన పైపులైన్ ప్రాజెక్టును హసీనా ప్రారంభించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories