దేశంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న నేపద్యంలో మరోసారి జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న నేపద్యంలో మరోసారి జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.. మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ఈ ప్రసంగించినున్నారు. గత గురువారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ .. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ లో స్వచ్ఛందంగా పాల్గొనలని కోరారు.. మోడీ పిలుపుకు మద్దతు తెలుపుతూ 130 కోట్ల భారతీయులు జనతా కర్ఫ్యూ లో పాల్గొని విజయవంతం చేశారు.. అనంతరం మెజార్టీ రాష్ట్రాలలో లాక్ డౌన్ విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
కరుణ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు నియంత్రణ పాటించకుండా రోడ్లపైకి రావడంతో ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్ డౌన్ విధించినప్పటికీ ప్రజలు ఇలా బయటకు రావడంతో వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆయా రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మూడో దశలో ప్రవేశించే అవకాశం ఉండడంతో జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించడం దేశవ్యాప్తంగా ఆసక్తినీ సంతరించుకుంది.
वैश्विक महामारी कोरोना वायरस के बढ़ते प्रकोप के संबंध में कुछ महत्वपूर्ण बातें देशवासियों के साथ साझा करूंगा। आज, 24 मार्च रात 8 बजे देश को संबोधित करूंगा।
— Narendra Modi (@narendramodi) March 24, 2020
Will address the nation at 8 PM today, 24th March 2020, on vital aspects relating to the menace of COVID-19.
ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 15 వేలకు పైగా చేరుకున్నాయి. ఇక భారత్లో 490 కేసులు నమోదు కాగా తొమ్మిది మంది మరణించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire