నేడు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ

నేడు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ
x
Prime Minister Narendra Modi
Highlights

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న నేపద్యంలో మరోసారి జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న నేపద్యంలో మరోసారి జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.. మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ఈ ప్రసంగించినున్నారు. గత గురువారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ .. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ లో స్వచ్ఛందంగా పాల్గొనలని కోరారు.. మోడీ పిలుపుకు మద్దతు తెలుపుతూ 130 కోట్ల భారతీయులు జనతా కర్ఫ్యూ లో పాల్గొని విజయవంతం చేశారు.. అనంతరం మెజార్టీ రాష్ట్రాలలో లాక్ డౌన్ విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

కరుణ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు నియంత్రణ పాటించకుండా రోడ్లపైకి రావడంతో ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్ డౌన్ విధించినప్పటికీ ప్రజలు ఇలా బయటకు రావడంతో వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆయా రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మూడో దశలో ప్రవేశించే అవకాశం ఉండడంతో జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించడం దేశవ్యాప్తంగా ఆసక్తినీ సంతరించుకుంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 15 వేలకు పైగా చేరుకున్నాయి. ఇక భారత్లో 490 కేసులు నమోదు కాగా తొమ్మిది మంది మరణించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories