Modi US Tour: అమెరికా పర్యటన ముగించుకొని భారత్‌ చేరుకున్న ప్రధాని మోడీ

Prime Minister Narendra Modi Return From America to India | National News Today
x

నరేంద్ర మోడీ (ట్విట్టర్ ఫోటో)

Highlights

* ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి ఘన స్వాగతం * అమెరికాలో మూడు రోజుల పాటు వరుస సమావేశాలు

Modi US Tour: అమెరికా పర్యటన ముగించుకొని భారత్‌కు చేరుకున్నారు ప్రధాని మోదీ. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. పలువురు మంత్రులు, అధికారులతో పాటు బీజేపీ శ్రేణులు పెద్ద ప్రజలు సంఖ్యలో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈనెల 23న అమెరికాలో ల్యాండ్ అయిన ప్రధాని. మూడ్రోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించారు. దిగ్గజ కంపెనీలు, ప్రతినిధులు, క్వాడ్ దేశాధినేతలు, అగ్రరాజ్యాధినేత బైడెన్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్‌తోనూ పలు కీలక అంశాలపై చర్చించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగాతోనూ మోదీ సమావేశమయ్యారు.

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయమంతమయ్యింది. మూడు రోజుల అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడిపారు. మొత్తం 65 గంటల్లో అమెరికా గడ్డపై 20 సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు. మోదీ ప్రతి పర్యటనలాగే ఈ అమెరికా పర్యటన కూడా తక్కువ సమయంలో, ఎక్కువ ఉత్పాదకత సాధించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా తీరిక లేకుండా పాల్గొన్న సమావేశాలు ఫలప్రదం అయ్యాయని ఇండియాకు బయలు దేరే ముందు మోదీ ట్వీట్ చేశారు

Show Full Article
Print Article
Next Story
More Stories