ఢిల్లీలో పీఐబీ ఛీఫ్‌కు కరోనా పాజిటివ్‌..

ఢిల్లీలో పీఐబీ ఛీఫ్‌కు కరోనా పాజిటివ్‌..
x
Representational Image
Highlights

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేఎస్‌ ధత్వాలియాకు కరోనావైరస్ సోకింది.

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేఎస్‌ ధత్వాలియాకు కరోనావైరస్ సోకింది. ఆయనకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన ప్రభుత్వ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కరోనా పాజిటివ్‌ రావడంతో చికిత్స నిమిత్తం ధత్వాలియాను ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో చేర్పించారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఆయనను ఎయిమ్స్ కు తరలించారు. కాగా అతని ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ధత్‌వాలియాకు కరోనా సోకడంతో జాతీయ మీడియా కేంద్రాన్ని సోమవారం పూర్తిగా మూసివేసి శానిటైజ్‌ పనులు చేస్తున్నారు. ఈ విషయాన్నీ పీఐబీ అధికారులు వెల్లడించారు.

కాగా ధత్‌వాలియా ఈ మధ్య జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రకాష్‌ జవదేకర్‌లతో కలిసి సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. దాంతో ఆయన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలావుంటే పీఐబీకి నాయకత్వం వహించే ధత్వాలియా కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రధాన ప్రతినిధిగా ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories