ముగిసిన ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు

ముగిసిన ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు
x
Highlights

అశ్రునయనాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని లోధి స్మశానవాటికలో..

అశ్రునయనాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని లోధి స్మశానవాటికలో ప్రణబ్ అంత్యక్రియలు జరిగాయి. అధికారిక లాంఛనాలతో ప్రణబ్ కు అంతిమ వీడ్కోలు పలికారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం అతి తక్కువ మందిని మాత్రమే అనుమతించారు. ఇక అంతకు ముందు రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రణబ్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయనకు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తుది వీడ్కోలు పలికారు. కాగా సుమారు నెల రోజులపాటు కరోనాతో పోరాడి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories