ప్రధాని మోదీ సంచలన ట్వీట్.. సోషల్ మీడియాకు గుడ్ బై ?

ప్రధాని మోదీ సంచలన ట్వీట్.. సోషల్ మీడియాకు గుడ్ బై ?
x
మోదీ ఫైల్ ఫోటో
Highlights

సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరు.

సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరు. ట్విట్టర్‌లో ప్రధాని మోదీకి 5.33 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 3 కోట్లపైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతే కాకుండా ఫేస్ బుక్ లో నాలుగు కోట్ల మంద్రి మోదీని ఖాతాను లైక్ చేశారు. ఈ నేపథ్యంలో మోదీ సోషల్ మీడియా నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ ఆదివారం నుంచే సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూట్యూబ్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు. తాను సోషల్ మీడియాలో లేకపోయినా అందరూ చురుగ్గా పోస్టింగ్‌లు చేయాలని సూచించారు.

అయితే ప్రధాని మోదీ ఉన్నట్లుండి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలిసిరాలేదు. అయితే, అన్ని సామాజిక మాధ్యమాల నుంచి వైదొలుగుతానని ప్రధాని చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. మోదీ చేసిన ఆ ట్వీట్‌ను 35 వేల మంది ఇప్పటి వరకు లైక్ చేయగా.., 12 వేల మంది రీ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories