వలసకూలీల మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

వలసకూలీల మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
x
Highlights

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. వలస కూలీలను తరలిస్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీ కొట్టడంతో 23 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు....

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. వలస కూలీలను తరలిస్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీ కొట్టడంతో 23 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఔరాయా జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. రాజస్థాన్ నుంచి ఉత్తర ప్రదేశ్ వెళ్తుండగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని గుర్తుచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories