ముఖ నటుడు మోహన్బాబు కుటుంబం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైయ్యారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ప్రముఖ నటుడు మోహన్బాబు కుటుంబం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైయ్యారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మోహన్బాబు కుటుంబంతో మోదీ కలిసిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. మోహన్బాబు మీ కుటుంబంతో, మీతో సమావేశం కావడం ఎంతో సంతోషంగా ఉంది. చాలా విషయాలపై మన మధ్య చర్చ జరిగింది. సినిమాల గురించి, ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఎలా పెంచాలని అనే అంశాలపై ఇరువురం చర్చించామని అంటూ మోదీ ట్విటర్లో వెల్లడించారు. మోదీతో సమావేశం సందర్భంగా 'వాట్ ఏ మ్యాన్!' అని కామెంట్ తో మోహన్ బాబు ట్విట్ కు ట్యాగ్ చేశారు.
అయితే ఈ సమావేశం మోహన్బాబుతోపాటు కుమారులు విష్ణు, మనోజ్, కూతురు మంచు లక్ష్మీ కూడా ఉన్నారు. సమావేశం అనంతరం మోహన్బాబు మాట్లాడారు... ప్రధాని మోడి, అమిత్ షాలను ప్రశంసలతో ముంచెత్తారు. దేశాన్ని గొప్ప స్థానంలో నిలిపిన వ్యక్తి మోడీ ఒక్కరే అన్నారు. హోంమంత్రి పదవికి వన్నెతెచ్చిన నేత అమిత్ షా అని ప్రశంసించారు. బీజేపీ పాలన కొంతమందికి మంచిగా కొంతమందికి చెడుగా ఉండటమే సహజమేనని అన్నారు. మోడీ, షాలతో భేటీలో ఏం మాట్లాడుకున్నామో త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.
అయితే ప్రధాని మోదీతో మోహన్ బాబు సమావేశం కావడంపై బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే అమిత్ షాను కలిసిన అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు... మోదీ మిమ్మల్ని బీజేపీలోకి ఆహ్వానించారా? అని ప్రశ్నించగా.. ఆ విషయం మోహన్బాబు దాటవేశారు. తిరుపతిలోని తమ విద్యాసంస్థలను సందర్శించాలని మోదీని కోరానన్నారు.
It was a delight to meet your family and you, @themohanbabu.
— Narendra Modi (@narendramodi) January 6, 2020
We had very good discussions on many issues including the importance of cinema and how we can deepen cultural linkages between people. https://t.co/hCmcGumRyy pic.twitter.com/5jH0wQnlmb
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire