కుమార్తె పెళ్లికి ఆహ్వానించిన రిక్షా పుల్లర్‌ ప్రధాని మోదీతో భేటీ

కుమార్తె పెళ్లికి ఆహ్వానించిన రిక్షా పుల్లర్‌ ప్రధాని మోదీతో భేటీ
x
Highlights

కుమార్తె వివాహ మొదటి ఆహ్వాన పత్రికను ప్రధాని నరేంద్ర మోదీకి పంపిన రిక్షా పుల్లర్ మంగల్ కెవాట్‌.. ఫిబ్రవరి 16 న వారణాసిలో ప్రధానిని కలిశారు. ఈ...

కుమార్తె వివాహ మొదటి ఆహ్వాన పత్రికను ప్రధాని నరేంద్ర మోదీకి పంపిన రిక్షా పుల్లర్ మంగల్ కెవాట్‌.. ఫిబ్రవరి 16 న వారణాసిలో ప్రధానిని కలిశారు. ఈ సందర్బంగా మంగల్ కేవత్ మరియు అతని కుటుంబం సభ్యుల యోగక్షేమాల గురించి ప్రధాని ఆరా తీశారు.. స్వచ్ఛ భారత్ అభియాన్ కు ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో మంగల్ కేవత్ తన గ్రామంలోని గంగా బ్యాంకులను స్వయంగా శుభ్రం చేయడానికి నడుం బిగించిన సంగతి తెలిసిందే.

తన కుమార్తె వివాహానికి మోదీని ఆహ్వానించిన ఆయన.. మోదీ నుంచి అభినందన లేఖ అందుకున్నారు. "మేము ప్రధాని నరేంద్ర మోడీకి మొదటి ఆహ్వానాన్ని పంపించాము, నేను దానిని వ్యక్తిగతంగా ఢిల్లీ లోని పిఎంఓ వద్ద అప్పగించాను. అయితే ఫిబ్రవరి 8న పిఎం మోడీ నుండి మాకు అభినందన లేఖ వచ్చింది, ఇది మాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది" అని చెప్పారు. మంగళ కేవాట్.. భార్య రేణు దేవి ఇద్దరూ స్వయంగా ప్రధాని మోదీని కలవాలని వారణాసి పర్యటనలో అధికారులను కోరడంతో ఇది సాధ్యమైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories