Narendra Modi: ప్రధాని మోదీకి బ్రెజిల్​ అత్యన్నుత పురస్కారం.. ఇప్పటికి 26 అవార్డులు సొంతం

Narendra Modi
x

Narendra Modi: ప్రధాని మోదీకి బ్రెజిల్​ అత్యన్నుత పురస్కారం.. ఇప్పటికి 26 అవార్డులు సొంతం

Highlights

Narendra Modi: ప్రధాని మోదీ అందుకున్న 26వ అంతర్జాతీయ గౌరవం

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. బ్రెజిల్ దేశం తన అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ ను మోదీకి ప్రదానం చేసింది. మంగళవారం బ్రెసీలియాలోని అల్వొరాడా ప్యాలెస్ వద్ద బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా ఈ గౌరవాన్ని ప్రధానికి అందించారు.

ఇది ప్రధాని మోదీకి అందిన 26వ అంతర్జాతీయ గౌరవం కావడం విశేషం. జులై 2న ప్రారంభమైన ఐదు దేశాల పర్యటనలో ఇది మోదీకి లభించిన మూడో అత్యున్నత విదేశీ పురస్కారం కావడం మరో విశిష్టతగా నిలిచింది. ఈ సందర్భంగా మోదీకి బ్రెజిల్ సైన్యం 114 గుర్రాలతో గౌరవ వందనాన్ని ఇచ్చింది.

ఇతర దేశాల నుంచి కూడా పురస్కారాలు:

ఈ పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం కూడా మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారం **‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’**ను ప్రదానం చేసింది. ప్రధాని మోదీ చూపిన ప్రపంచ స్థాయి నాయకత్వం, ప్రవాస భారతీయుల పట్ల మమకారం, కోవిడ్ సమయంలో మానవతా సేవలు వంటి అంశాలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించినట్లు ఆ దేశ ప్రధాని కమలా పెర్సాద్ బిస్సేస్సర్ తెలిపారు.

అంతకుముందు ఘనా దేశం ప్రధానికి ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ పురస్కారం ప్రదానం చేసింది. విదేశీ రాజధానుల నుంచి వరుసగా అందుతున్న ఈ గౌరవాలు మోదీ అంతర్జాతీయ స్థాయిలో నేతగా గుర్తింపు పొందిన విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories