PM Modi: పిల్లలకు రూ. 10 ల‌క్ష‌ల ఫండ్ ప్ర‌క‌టించిన మోదీ

PM Modi: కోవిడ్ బాధిత పిల్లల మద్దతు- సాధికారత కోసం PM కేర్స్ ఫథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.

Samba Siva Rao
Published on: 29 May 2021 7:45 PM IST
PM announces ₹10 lakh fund, free education, other benefits for kids
X

మోడీ ఫైల్ ఫోటో 

PM Modi: కోవిడ్ కార‌ణంగా అనాథ‌లైన పిల్ల‌ల కోసం కేంద్రం కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించింది. కోవిడ్ బాధిత పిల్లల మద్దతు- సాధికారత కోసం PM కేర్స్ ఫథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన పీఎం మోదీ పిల్లలు దేశ భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహిస్తారు , అలాంటి పిల్లలను ఆదరించడానికి రక్షించడానికి మేము అన్నింటినీ చేస్తాము.. సమాజంగా మన పిల్లలను బాగా చూసుకోవడం..ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశను కలిగించడం మన కర్తవ్య‌మ‌ని ఆయ‌న అన్నారు. ఈ పథకం ద్వారా కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత నెలవారీ స్టైఫండ్, పిఎం కేర్స్ నుండి 23 ఏళ్లు నిండినప్పుడు రూ .10 లక్షల ఫండ్ లభిస్తుంది.కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఈ ఫథకం ద్వారా ఉచిత విద్య అందించ‌నుంది.

పిల్లల ఉన్నత విద్య కోసం విద్య రుణం పొందడానికి ఈ ఫథకం సహాయం చేయబడంతో పాటు, రుణంపై వడ్డీని చెల్లిస్తుంది.పిల్లలకు ఆయుష్మాన్ భారత్ కింద 18 సంవత్సరాల వరకు 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా లభిస్తుంది ఈ ప్రీమియం PM కేర్స్ ద్వారా చెల్లించబడుతుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story