
PM Kisan Rules: ప్రతి ఏడాది రూ. 12వేలు.. తండ్రీకొడుకులకు పీఎం కిసాన్ డబ్బులు.. ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే..!!
PM Kisan Rules: రైతులకు ప్రతి ఏడాది ఆర్థికంగా ఊరటనిచ్చే పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. చిన్న, సన్నకారు రైతులకు సాగు పెట్టుబడి భారం తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 నగదు సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతలుగా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. వ్యవసాయ పనుల కోసం అప్పులపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ నిధులు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక ముఖ్యమైన సందేహం చాలా మందిని వేధిస్తోంది. అదేంటంటే.. ఒకే ఇంట్లో ఉన్న తండ్రి, కొడుకు ఇద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందగలరా? లేదా భార్యాభర్తలు ఇద్దరికీ విడివిడిగా లాభం వస్తుందా? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.
ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన నిబంధనలు పెట్టింది. పీఎం కిసాన్ నియమాల ప్రకారం కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్ పిల్లలు అని అర్థం. ఈ కుటుంబ యూనిట్కు కేవలం ఒక్కరికి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. భూమి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే, ఒక కుటుంబం నుంచి ఒకే లబ్ధిదారుడిని మాత్రమే ప్రభుత్వం గుర్తిస్తుంది. ప్రభుత్వ భూ రికార్డుల్లో ఎవరి పేరు మీద సాగు భూమి ఉంటే వారే పథకానికి అర్హులు అవుతారు.
భార్యాభర్తలు ఇద్దరి పేర్లపై వేర్వేరుగా భూములు ఉన్నా కూడా ఇద్దరికీ డబ్బులు రావు. వారిలో ఒకరు మాత్రమే పీఎం కిసాన్కు నమోదు చేసుకోవాలి. పొరపాటున ఇద్దరూ దరఖాస్తు చేసి డబ్బులు పొందితే, అది తప్పుగా పరిగణిస్తారు. అటువంటి సందర్భాల్లో ప్రభుత్వం అక్రమంగా పొందిన మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తుంది. ఇప్పటికే అనేక చోట్ల సామాజిక తనిఖీల్లో ఇలాంటి కేసులు బయటపడ్డాయి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే ఇంట్లో ఇద్దరికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అన్నదమ్ములు విడిపోయి, వారి భూములు వేర్వేరు పేర్లపై నమోదై ఉంటే, అలాగే రేషన్ కార్డులో కూడా వేర్వేరు కుటుంబాలుగా ఉంటే ఇద్దరూ పీఎం కిసాన్కు అర్హులు అవుతారు. కేవలం బ్యాంక్ ఖాతాలు వేరుగా ఉన్నాయన్న కారణంతో ప్రభుత్వం వేరు కుటుంబాలుగా గుర్తించదు. రెవెన్యూ రికార్డులే ప్రధాన ఆధారం.
ఇక అనర్హుల విషయానికి వస్తే.. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు రూ.10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు ఈ పథకానికి అర్హులు కాదు. తప్పుడు వివరాలు ఇచ్చి చేరిన వారిని ప్రభుత్వం ఇప్పటికే పెద్ద సంఖ్యలో గుర్తించి పథకం నుంచి తొలగించింది. పారదర్శకత కోసం ఈ-కేవైసీని కూడా తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు చాలా సులభంగా మారింది. రైతులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, భూమి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆన్లైన్ సౌకర్యం లేని వారు మీ-సేవ కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల సహాయం తీసుకోవచ్చు.
పీఎం కిసాన్ పథకం నిజమైన రైతులకు ఎంతో మేలు చేస్తోంది. అయితే నియమాలను ఉల్లంఘించి అనర్హులు చేరితే నిజమైన లబ్ధిదారులకు నష్టం కలుగుతుంది. అందుకే ప్రభుత్వం కఠినంగా తనిఖీలు చేపడుతోంది. అర్హులు మాత్రమే సాయం పొందినప్పుడే ఈ పథకం లక్ష్యం పూర్తిగా నెరవేరుతుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




