Delhi: 4 కోట్ల పాత వాహనాలపై హరిత పన్ను

Delhi: 4 కోట్ల పాత వాహనాలపై హరిత పన్ను
x

ఢిల్లీ:(ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Delhi: దేశవ్యాప్తంగా 4 కోట్ల పాత వాహనాలపై హరిత పన్నును విధించబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది.

Delhi: హరితపన్నుపై గత జనవరిలో సిద్ధం చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అమలు చేసేందు కేంద్రం సిద్ధమయ్యింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ వివరాలను డిజిటలైజ్ చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 4 కోట్ల పాత వాహనాలపై హరిత పన్నును విధించబోతున్నట్టు ప్రకటించింది. అందులో కర్ణాటకవే 70 లక్షల దాకా పాత వాహనాలున్నట్టు చెప్పింది. అయితే, తెలుగు రాష్ట్రాల వివరాలు అందుబాటులో లేకపోవడంతో వాటిని వెల్లడించలేదు. మరోవైపు మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ల వివరాలూ కేంద్రం వద్ద లేవని స్పష్టం చేసింది. 8 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలపై 10 నుంచి 25 శాతం వరకు పన్నులు వసూలు చేయనుంది.

4 కోట్ల పాత వాహనాల్లో సగానికిపైగా 20 ఏండ్ల వాహనాలేనని కేంద్రం చెప్పింది. కర్ణాటక తర్వాత అత్యధిక పాత వాహనాలున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తర్ ప్రదేశ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో 56.54 లక్షల పాత వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. అందులో 24.55 లక్షల వాహనాలు 20 ఏండ్లకు పైనవే కావడం గమనార్హం. 49.93 లక్షల పాత వాహనాలతో ఢిల్లీ మూడోప్లేస్ లో ఉంది. ఆ రాష్ట్రంలో 20 ఏండ్లకు పైబడిన 35.11 లక్షల పాత వాహనాలున్నాయి. కేరళలో 15 ఏళ్లకు పైబడిన వాహనాలు 34.64 లక్షలుంటే.. తమిళనాడులో 33.43 లక్షలున్నాయి.

పంజాబ్ లో 25.38 లక్షలు, పశ్చిమ బెంగాల్ లో 22.69 లక్షలున్నాయి. మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, హర్యానాల్లో 17.58 లక్షల నుంచి 12.29 లక్షల వరకున్నాయి. ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అసోం, బీహార్, గోవా, త్రిపుర, దాద్రానగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూల్లో లక్ష నుంచి 5.44 లక్షల వరకు పాత వాహనాలున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వాటన్నింటిపైనా ఇప్పుడు కేంద్రం హరిత పన్నును వసూలు చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories