coronavirus : నోయిడాలో ఏప్రిల్ 30 వరకు 144 సెక్షన్

coronavirus : నోయిడాలో ఏప్రిల్ 30 వరకు 144 సెక్షన్
x
Highlights

ఉత్తర ప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నేపథ్యంలో, నోయిడా (గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా)లో సెక్షన్ 144 సిఆర్‌సిపిని ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని అధికారులు నిర్ణయించారు.

ఉత్తర ప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నేపథ్యంలో, నోయిడా (గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా)లో సెక్షన్ 144 సిఆర్‌సిపిని ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని అధికారులు నిర్ణయించారు.ఈ మేరకు అదనపు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. సెక్షన్ 144 సిఆర్‌సిపిని ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నామని, అంతేకాదు ప్రదర్శనలు, సమావేశాలు కూడా పరిమితం చేస్తున్నట్టు ప్రకటించారు.

లాక్డౌన్ వ్యవధిలో విద్యార్థుల ఫీజు చెల్లించమని తల్లిదండ్రులను బలవంతం చేయవద్దని నోయిడాలోని అధికారులు అన్ని విద్యా సంస్థలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే విద్యార్థులను ఆన్‌లైన్ తరగతుల నుంచి కూడా తప్పించవద్దని జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ ఎల్‌వై ఆదేశించారు.

దేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య ఈ చర్య తీసుకోబడింది. నోయిడాలో, COVID-19 ఇప్పటివరకు 58 మందిని ప్రభావితం చేసింది. సంక్రమణకు సంబంధించి కొత్తగా ఎనిమిది కేసులు శనివారం నమోదయ్యాయి. తాజా కేసుల్లో నాలుగు సెక్టార్ 5 లోని జెజె క్లస్టర్, ఒకటి సెక్టార్ 135 లోని వాజిద్పూర్ గ్రామం, నోయిడాలోని సెక్టార్ 62 నుండి మూడు కేసులు నమోదయ్యాయి.

కాగా "గౌతమ్ బుద్ధ నగర్ నుండి ఇప్పటివరకు మొత్తం 804 నమూనాలను కోవిడ్ -19 పరీక్షకు పంపారు, అందులో 58 పాజిటివ్ పరీక్షలు, 614 నెగటివ్ మిగిలిన ఫలితాలు రావాల్సి ఉందని" అని నోయిడా ఆరోగ్య విభాగం తన రోజువారీ ప్రకటనలో తెలిపింది.

నోయిడా ఆరోగ్య విభాగం ప్రకారం, ఎనిమిది మంది సంక్రమణకు గురై ప్రస్తుతం కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం, నోయిడా , గ్రేటర్ నోయిడా అంతటా 1,129 మంది నిఘాలో ఉన్నారు, మరో 331 మందిని నిర్బంధించారు - గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయ హాస్టల్‌లో 69 మంది ,మిగిలినవారు నోయిడా , గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రులలో ప్రత్యేక ఐసోలేషన్ సదుపాయాలలో ఉన్నారు. కాగా ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ దేశంలో కరోనావైరస్ హాట్‌స్పాట్‌గా అవతరించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories