Nirbhaya Case: పవన్ గుప్తా క్షమాబిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి

Nirbhaya Case: పవన్ గుప్తా క్షమాబిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి
x
Highlights

నిర్భయ కేసులో దోషిగా తేలిన పవన్ గుప్తా క్షమాబిక్ష పిటిషన్ను భారత రాష్ట్రపతి తిరస్కరించారు.

నిర్భయ కేసులో దోషిగా తేలిన పవన్ గుప్తా క్షమాబిక్ష పిటిషన్ను భారత రాష్ట్రపతి తిరస్కరించారు. నిర్భయ కేసులో నలుగురు మరణశిక్ష దోషులలో ఒకరైన గుప్తా సోమవారం క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు (ఎస్సీ) కొట్టివేసిన కొద్ది గంటలకే భారత రాష్ట్రపతి ముందు తాజా క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 2012 డిసెంబర్‌లో జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులందరినీ ఉరి తీయడంలో మరోసారి ఆలస్యం జరిగింది. అతను మార్చి 3 న ఇతర దోషులతో పాటు ఉరితీయటానికి ఒక రోజు ముందు అతను తాజా పిటిషన్ను దాఖలు చేశాడు.

అయితే రాష్ట్రపతి దీనిని తిరస్కరించారు. మరో ముగ్గురు దోషుల దయ పిటిషన్లు ఇప్పటికే కొట్టివేయబడ్డాయి. దాంతో నిందితులు అందరూ తమ క్షమాబిక్ష అవకాశాలను వినియోగించుకున్నట్టయింది. దీంతో నిర్భయ దోషులకు అన్ని దారులు మూసుకుపోయినట్టయిందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ కేసులో తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందో అని దేశం ఆసక్తికరంగా గమనిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories