ఆదివారం గోవాలో భారత నేవీ మిగ్ విమానం కూలిపోయింది. ఈ విషయాన్నీ భారత నావికాదళం ధృవీకరించింది. రొటీన్ ప్రక్రియలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆదివారం గోవాలో భారత నేవీ మిగ్ విమానం కూలిపోయింది. ఈ విషయాన్నీ భారత నావికాదళం ధృవీకరించింది. రొటీన్ ప్రక్రియలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మిగ్ 29 కె విమానం ఆదివారం ఉదయం 10.30 గంటలకు గోవా తీరంలో ఒక సాధారణ శిక్షణా ప్రక్రియను నిర్వహిస్తోంది. ఆ సమయంలో అదుపుతప్పి విమానం కూలిపోయింది.
విమానం పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది భారత నావికాదళం, అందులో " ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించబడింది.. లోపాలను పరిశీలించాలి " అని పేర్కొంది. గత రెండేళ్ల వ్యవధిలోనే గోవాలో మూడుసార్లు విమాన ప్రమాద ఘటనలు జరిగాయి. నవంబర్ 2019 లో గోవాలోని ఒక గ్రామం బయట మిగ్ 29 కె విమానం కూలిపోయింది. ఈ ఘటన జరిగిన మూడు నెలల తరువాత తాజా ప్రమాదం జరిగింది.
నవంబర్ 16 న గోవాలోని ఒక గ్రామం బయట భారత నేవీ ఎంఐజి ట్రైనర్ విమానం కూలిపోయింది. ఈ ఘటన రాష్ట్ర రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెర్నా శివార్లలోని రాతి పీఠభూమిపై ఈ విమానం కూలిపోయింది.. అయితే పైలట్ ఈ విమానాన్నీ జనాభా లేని ప్రాంతానికి తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పుడు కూడా , పైలట్లు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.
అప్పట్లో విమానం ఇంజిన్ లోకి పక్షి వెళ్లడంతో మంటలు చెలరేగాయి.. దాంతో ఎడమ ఇంజిన్ క్రాష్ అయింది. అలాగే జనవరి 2018 లో గోవాలో మరో మిగ్ -29 కె విమానం కూలిపోయింది. ఈ విమానం రన్వేపై నుంచి దూసుకెళ్లి ఐఎన్ఎస్ హమ్సా బేస్ లోపల కుప్పకూలింది. ఘటనలో ట్రైనీ పైలట్ విమానం నుండి సురక్షితంగా బయట పడ్డారు. ఈ సంఘటన కారణంగా గోవా విమానాశ్రయానికి పౌర విమానాల రాక పోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire