సొరెన్‌ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న హేమాహేమీలు వీళ్లే

సొరెన్‌ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న హేమాహేమీలు వీళ్లే
x
Hemant Soren
Highlights

జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో జేఎంఎం,కాంగ్రెస్,ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది.

జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో జేఎంఎం - కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్‌ సొరేన్‌ ఈ నెల 29న ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే హేమంత్‌ సొరేన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు హాజరుకానున్నారు. . కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని స్వయంగా కలిసి వారిని ఆహ్వానించారు హేమంత్ సోరెన్.

అలాగే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. విపక్ష నేతలంతా పెద్ద ఎత్తున హాజరు కానున్నా నేపధ్యంలో అందరి దృష్టి జార్ఖండ్ వైపు మళ్లింది.

బీజేపీ మరో రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. జేఎంఎం - కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జేఎంఎం అవసరమైన స్పష్టమైన మెజార్టీ సాధించింది. రాష్ట్రంలో మొత్తం 81 స్థానాలకు గాను ఈ కూటమి 47 స్థానాల్లో విజయం సాధించింది. అధికార బీజేపీ కేవలం 25 స్థానాలకే పరిమితమైంది. ఓటమి అనంతరం ముఖ్యమంత్రి పదవికి రఘుబర్ దాస్ రాజీనామా చేశారు.

సాక్షాత్తూ సీఎం రఘుబర్ దాస్ ఓడిపోవడం బీజేపీ పరాభవానికి అద్దం పడుతోంది. ఇక జేవీఎం 2, ఏజేఎస్‌యూ 2, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. జార్ఖండ్ అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 41 కాగా జేఎంఎం కూటమి మెజారిటీకి అవసరమైన స్థానాల కంటే 6 సీట్లను అధికంగా గెలుచుకుంది. జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం అభ్యర్థి హేమంత్‌ సోరెన్‌ తాను పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఎన్నికల వరకు ఏజేఎస్‌యూతో కలిసి కూటమిగా పోటీ చేసిన కాషాయం పార్టీ ఈసారి సీట్ల పంపకాల విషయంలో పొరపొచ్చాల కారణంగా ఒంటరిగా బరిలో దిగింది. ఇదే సమయంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిగా పోటీ చేయడం కలిసొచ్చింది. ఈ పార్టీలు వరసగా 43, 31, 7 స్థానాల్లో పోటీ చేశాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలదన్ని జేఎంఎం భారీ విజయం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories