జామియా యూనివర్సిటీలో మరోసారి కాల్పుల కలకలం

జామియా యూనివర్సిటీలో మరోసారి కాల్పుల కలకలం
x
Highlights

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. విశ్వవిద్యాలయం వెలుపల ఆదివారం రాత్రి ఇద్దరు దుండగుల కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. విశ్వవిద్యాలయం వెలుపల ఆదివారం రాత్రి ఇద్దరు దుండగుల కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. జామియా మిలియా ఇస్లామియా యొక్క గేట్ నంబర్ 7 వద్ద నిరంతర నిరసన ఉందని పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో స్కూటీలో ప్రయాణిస్తున్న ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి నిరసన జరుగుతున్న గేట్ నెంబర్ 7 సమీపంలో గాల్లోకి కాల్పులు జరిపినట్లు నిరసనకారులు పేర్కొన్నారు. నిరసనకారులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. ఆ కుర్రాళ్ళు కాల్పులు జరిపి గేట్ నంబర్ 5 ముందు ఉన్న సారాయ్ జులేనా వైపు పరుగులు తీసినట్టు తెలిసింది.

దాడి చేసిన వారు ఎరుపు రంగు మోటారు సైకిల్‌పై వచ్చారు, సవరించిన పౌరసత్వ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థుల బృందం జామియా కోఆర్డినేషన్ కమిటీ (జెసిసి) అక్కడికి చేరుకుంది. ఈ సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మరోవైపు కాల్పులు జరిగిన ప్రాంతంలో బుల్లెట్ షెల్స్ లభించలేదని డిసిపి కుమార్ జ్ఞానేష్ వెల్లడించారు. అదే సమయంలో, ప్రత్యక్ష సాక్షుల నుండి కూడా వేర్వేరు ప్రకటనలు గుప్పిస్తున్నారని చెప్పారు. భారతీయ శిక్షాస్మృతి మరియు సాయుధ చట్టం సెక్షన్ల కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

జామియా నగర్‌లో ఒకే వారంలో జరిగిన మూడవ కాల్పుల సంఘటన ఇది. కాగా జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) కు నిరసనగా గత వారంలోనే జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నుంచి రాజ్‌ఘాట్‌కు నిరసన ప్రదర్శన నిర్వహించారు విద్యార్థులు. ఈ ప్రదర్శనలో ఒక వ్యక్తి తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక విద్యార్థి గాయపడ్డాడు. పోలీసులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. పోలీసులు వెంటనే దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన విద్యార్థిని షాదాబ్‌గా గుర్తించారు. అతను జామియా మిలియా విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories