Budgetలో రైతుల కోసం 2 కొత్త స్కీమ్స్?

Budgetలో రైతుల కోసం 2 కొత్త స్కీమ్స్?
x
బడ్జెట్‌లో రైతుల కోసం 2 కొత్త స్కీమ్స్?
Highlights

మోడీ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈసారి బడ్జెట్‌పై భారీ అంచనాలే...

మోడీ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈసారి బడ్జెట్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ముఖ్యంగా రైతుల కోసం 2 కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.

మోడీ సర్కార్ రైతులకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది. బడ్జెట్ 2020లో వీరి కోసం రెండు కీలక పథకాలను ఆవిష్కరించే అవకాశముంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు యూనియన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పథకాల విషయానికి వస్తే వీటిల్లో ఒకటి కార్ప్ డైవర్సిఫికేషన్ కు సంబంధించిన స్కీమ్ కావొచ్చు. మరొకటి ఎఫ్‌పీవో ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించే పథకం మరొకటి అయ్యే అవకాశముంది. కేంద్రం గత బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామని ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌పీవో కార్యక్రమానికి 7వేల కోట్లు కేటాయించే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీనివల్ల 10 వేల వరకు ఎఫ్‌పీవోల ఏర్పాటు సాధ్యం కావొచ్చు. ఎఫ్‌పీవోల్లోని చిన్న, సన్నకారు రైతుల గ్రూప్‌‌లు రైతుల ఆదాయం పెరగుదలకు సాయం అందిస్తారు.

వ్యవసాయ మంత్రత్వి శాఖ ఎఫ్‌పీవోలకు నిధులకు సమకూరుస్తుంది. అలాగే ఇతరత్రా అవసరమైన వాటిని అందిస్తుంది. ఇంకా ఏమైనా టెక్నాలజీ పరమైన అవసరాలు ఉంటే వాటికి కూడా తీరుస్తుంది. ఎఫ్‌పీవోలు బిజినెస్ యూనిట్లుగా పనిచేస్తాయి. వీటికి వచ్చే లాభాలు ఆ గ్రూప్‌లోని సభ్యులే తీసుకుంటారు.

ఎప్‌పీవో కార్యక్రమం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కార్ప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్‌ను కూడా లాంచ్ చేయొచ్చు. దీని కోసం 500 నుంచి 600 కోట్ల రూపాయలు కేటాయించే ఛాన్స్ ఉంది. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తున్న ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకురావొచ్చు. నేలను సారవంతంగా మార్చడం, వ్యవసాయ-పర్యావరణ సమతుల్యత అనే అంశాలు ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలుగా ఉండనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories