Mizoram: ఎలక్షన్‌ కౌంటింగ్‌ తేదీ మార్పు.. ఈసీ కీలక ప్రకటన

Mizoram Election Vote Counting Date Changed
x

Mizoram: ఎలక్షన్‌ కౌంటింగ్‌ తేదీ మార్పు.. ఈసీ కీలక ప్రకటన

Highlights

Mizoram: వివిధ వర్గాల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఈసీ

Mizoram: ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మార్పు చేసింది. తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతోపాటుగా మిజోరంలోనూ డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే, మిజోరంలో ఆదివారం కాకుండా ఇంకేదైనా రోజు ఓట్ల లెక్కింపు జరపాలని అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి.

దీంతో, వారి విజ్ఞాపనల్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు తేదీని డిసెంబర్‌ 4కు మార్పు చేసింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మిజోరంలో 40అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 9న ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories