జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన పోలీసులు

* నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసిన పోలీసులు * డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరాకు యత్నించిన టెర్రరిస్టులు

Sandeep Reddy
Published on: 14 Aug 2021 7:14 PM IST
Massive Terrorist Outbreak in Jammu and Kashmir And Police Arrested 4 Terrorists
X

ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసిన పోలీసులు(ట్విట్టర్ ఫోటో)

Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. దేశ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా బాంబు దాడులకు ప్లాన్‌ చేసిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైషే ఈ మహ్మద్‌ ఉగ్రవాద సంస్ధకు చెందిన ఉగ్రవాదులు ఇవాళ పట్టుబడ్డారు. ఈ నలుగురు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సేకరించి మిగిలిన ఉ‍గ్రవాదులకు సరఫరా చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు టూవీలర్‌కు ఐఈడీ అమర్చి పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు తేలింది. రేపటి స్వాంతంత్ర్య వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో బాంబు దాడులకు సిద్ధమైనట్లు గుర్తించారు. మరోవైపు కిష్త్వార్‌‌లో ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని బాంబ్ స్కాడ్ పేల్చివేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story