వివాహేతర సంబంధం బయటపడుతుందని మహిళ చేసిన పని చూస్తే..

వివాహేతర సంబంధం బయటపడుతుందని మహిళ చేసిన పని చూస్తే..
x
Highlights

వివాహేతర సంబంధాన్ని అత్త ఎక్కడ బయటపెడుతుందో అని ఏకంగా ప్రియుడితో పరారైంది ఓ మహిళ. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం పుదుక్కోటై జిల్లా మేల్‌నిలైపట్టి జరిగింది....

వివాహేతర సంబంధాన్ని అత్త ఎక్కడ బయటపెడుతుందో అని ఏకంగా ప్రియుడితో పరారైంది ఓ మహిళ. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం పుదుక్కోటై జిల్లా మేల్‌నిలైపట్టి జరిగింది. కోవిల్‌పట్టిలో గ్రామానికి చెందిన సులోచన (32)కు మేల్‌నిలైపట్టికి చెందిన యువకుడితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. సులోచన భర్త సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వారికి సంతానం లేరు. భర్త తాను సంపాదించిన సొమ్ముతో మేల్‌నిలైపట్టిలో ఇల్లు కట్టించాడు. భార్య, తల్లి కోసం ప్రతినెలా డబ్బులు పంపేవాడు. అయితే భర్త లేకపోవడంతో ఆమె అదే గ్రామానికి చెందిన మరొక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఇటీవల సులోచన అత్తకు అనుమానం వచ్చి ఆరాతీసింది. శనివారం రాత్రి సులోచన ప్రియుడు ఇంటికి వచ్చాడు. గమనించిన అత్త కోడలి బండారాన్ని బట్టబయలు చేసేందుకు ప్రయత్నించింది. వాళ్ళు ఇంట్లో ఉండగా తలుపులు వేసింది. దీంతో అత్త ఎక్కడ తమ సంబంధాన్ని బయటపెడుతుందో అని వెనకాల గేటు నుంచి ప్రియుడితో వెళ్లిపోయింది సులోచన. గ్రామస్థులు వారికోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories