ఒక భర్త... నలుగురు భార్యలు

ఒక భర్త... నలుగురు భార్యలు
x
Highlights

ఓ వ్యక్తి ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా నాలుగురిని వివాహం చేసుకున్నాడు. అయితే ఒకరికి తెలియకుండా మరోకరిని పదేళ్లలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు...

ఓ వ్యక్తి ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా నాలుగురిని వివాహం చేసుకున్నాడు. అయితే ఒకరికి తెలియకుండా మరోకరిని పదేళ్లలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఆ వ్యక్తి. దుబాయిలో మంచీ ఉద్యోగం.. చేతి నిండా పైసలు సంపాదిస్తూ.. నలుగురు భార్యలను ఇండియాలోనే ఉంచడం విశేషం. అయితే తీరా తన మొదటి భార్యకి వచ్చిన అనుమానంతో అతగాడి ముగుర్గి భార్యల గుట్టు రట్టైంది. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే... రామనాథపురానికి చెందిన కోమలాదేవి అనే మహిళకు గత 2008లో గంగనాథన్ అనే వ్యక్తితో పెళ్లి అయింది. గంగనాథన్ దుబాయిలో కొలువు, పైగా చూడడానికి అందంగా ఉన్నాడు ఇంకేముంది.. పెద్దలు మాట ముచ్చట మాట్లాడుకున్నారు. వెంటనే అందరి సమక్షంలో కోమలాదేవిని పెళ్లి చేసుకొని దుబాయి తీసుకువెళ్లాడు. అయితే గంగనాథన్‌ రాత్రివేళల్లో తరచూ బయటకు వెళ్లడంతో కోమలాదేవి తగవుపెట్టుకుంది. కాగా కొంత కాలం తర్వాత కోమలాదేవిని ఇండియాకు తీసుకువచ్చేశాడు. కొన్ని రోజుల తరువాత ఒక్కడే దుబాయ్‌ వెళ్లిపోయి అప్పుడప్పుడూ భార్య వద్దకు వచ్చేవాడు. వీరికి ప్రస్తుతం 9 సంవత్సరాల వయసుగల ఒక కొడుకు, కూ తురు ఉన్నారు.

అప్పటి నుంచి గంగనాథన్ మాత్రం దుబాయిలో ఉంటూ... అప్పుడప్పుడూ ఇండియాకు వచ్చేవాడు. ఇటీవల కోమలాదేవికి భర్త ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఇలా ఒకరోజు రామనాథపురం వచ్చినప్పుడు గంగనాథన్ ఫోన్ కి మిస్డ్ కాల్ వచ్చింది. అతని ఫోన్ పరిశీలించగా.. తనను కాకుండా మరో ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నట్లు గుర్తించింది. వారితో దిగిన ఫోటోలు, వీడియోలు చూసి కోమలాదేవి ఒక్కసారిగా కంగుతిన్నది. అయితే ఒక్కో భార్యతో వేర్వేరు విలాసాలు, రేషన్‌కార్డులు, ప్రభుత్వ నకిలీ డాక్యుమెంట్లు పొందాడు. గంగనాథన్ మోసాలను పసిగట్టిన కోమలాదేవి వెంటనే భర్తపై రామనాథపురం మహిళా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. రెండోభార్య కవితకు శ్రీధరన్, మూడోభార్య యమునకు గిరిధరన్, నాల్గో భార్య దీపకు ఒక కుమార్తె ఉండడం గమనార్హం. అయితే తనలా మోసపోయిన మిగితా ముగ్గురు మహిళలకు కూడా కోమలాదేవి సమాచారం అందజేసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories