Ayodhya: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి దూరంగా అద్వానీ, మురళీమనోహర్ జోషి

LK Advani And MM Joshi Requested Not To Come To Consecration Of Ayodhya Ram Temple
x

Ayodhya: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి దూరంగా అద్వానీ, మురళీమనోహర్ జోషి

Highlights

Ayodhya: ట్రస్ట్ సభ్యుల వినతిని అంగీకరించిన అద్వాణి, జోషి

Ayodhya: అయోధ్య రామమందిరం ఉద్యమానికి ఊపిరులూది.. ఉప్పెనలా మార్చిన బీజేపీ సీనియర్ నేతలు అద్వాణి, మురళీ మనోహన్‌ జోషి.. రామాలయం ఆరంభ కార్యక్రమానికి హాజరుకాబోవడంలేదు. ఈ మేరకు రామ మందిరం ట్రస్ట్ సోమవారం వెల్లడించింది. అద్వాణి, మురళీ మనోహర్ జోషిలు ఇద్దరూ... పెద్ద వయస్సువారు. అలాగే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిద్దరిని రామాలయ ప్రారంభకార్యక్రమానికి హాజరుకావద్దని విజ్ఞప్తి చేసినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. తమ వినతిని వారిద్దరూ అంగీకరించారని తెలిపారు. జనవరి 22న జరిగే ఆలయ ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ట్రస్ట్ సభ్యులు.

Show Full Article
Print Article
Next Story
More Stories