కేంద్ర మంత్రులతో కేటీఆర్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

కేంద్ర మంత్రులతో కేటీఆర్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
x
కేటీఆర్
Highlights

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ మంత్రి కేటీఆర్ బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్‌తో సమావేశమై...

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ మంత్రి కేటీఆర్ బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సాయం అందించాల్సిందిగా కోరారు.

ఈ సందర్భంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంక్లేవ్ 2019 సదస్సులో కేటీఆర్ పాల్గొ్న్నారు. ఈ సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో ఏర్పాటు చేస్తు్న్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు పలు విధాలుగా కేంద్రం సహాయం చేయాలని మంత్రిని కోరారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు నేసిన చీరను మంత్రి స్మృతి ఇరానీ అందజేశారు. అనంతరం పార్లమెంట్ హాలులో ఎంపీలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధిచి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడంలో ఎంపీలు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories