Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో కీలక అనుమానితుడు అరెస్ట్


Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో కీలక అనుమానితుడు అరెస్ట్
Rameshwaram Cafe: రహస్య ప్రాంతంలో షబ్బీర్ను విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులు
Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తిని NIA అరెస్టు చేసింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడిని షబ్బీర్గా గుర్తించారు. ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ అరెస్టుపై NIA అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఇతను సహకరించినట్లు సమాచారం. ఈ నెల ఒకటో తేదీన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఈ కేసును కర్ణాటక హోంశాఖ NIAకు అప్పగించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి చిత్రాలను విడుదల చేశారు. అతని ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రివార్డును సైతం NIA ప్రకటించింది. ఈ కేసులో నిందితుడు RDX ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



