జైల్లో ఆత్మహత్యాయత్నం చేసిన సైనైడ్ కిల్లర్ జాలీ షాజు

జైల్లో ఆత్మహత్యాయత్నం చేసిన సైనైడ్ కిల్లర్ జాలీ షాజు
x
Highlights

కేరళకు చెందిన సైనైడ్ కిల్లర్ జాలీ షాజు జైల్లో ఆత్మహత్యాప్రయత్నం చేశారు. తన మణికట్టును తనకు తాను కోసుకొని గాయపరచుకున్నారు. దీంతో జాలీ షాజును కోజికోడ్...

కేరళకు చెందిన సైనైడ్ కిల్లర్ జాలీ షాజు జైల్లో ఆత్మహత్యాప్రయత్నం చేశారు. తన మణికట్టును తనకు తాను కోసుకొని గాయపరచుకున్నారు. దీంతో జాలీ షాజును కోజికోడ్ మెడికల్ కాలేజీకి చికిత్స కోసం తరలించారు. కోజికోడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జాలీ తన మణికట్టును బ్లేడుతో కోసుకుందని.. దీంతో ఆమె చేతికి తీవ్ర రక్తస్రావం జరిగిందని.. దాంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్టు చెప్పారు.

కాగా తన కుటుంబంలోని 6 మందిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జాలీ షాజు. ఆమె తన సొంత కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులను 14 సంవత్సరాల కాలంలో చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో జాలీని కోజికోడ్ జిల్లా జైలులో ఉంచారు. హత్యకు సైనైడ్‌ను ఉపయోగించారనే ఆరోపణలతో ఆమె తోపాటు సన్నిహితులైన ఎంఎస్ మాథ్యూ, పి ప్రజకుమార్‌ లను కూడా 2019 లో అరెస్టు చేశారు.

ఫోరెన్సిక్ నిపుణులు బాధితుల మృతదేహాలను వారి సమాధుల నుండి వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించిన తరువాత ఈ అరెస్టులు జరిగాయి.గత ఏడాది ప్రారంభంలో, ఆరుగురు కుటుంబ సభ్యులను చంపినట్లు జాలీ అంగేకరించారు. కేసును నిర్వహిస్తున్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ (ఐఓఓ) ఆస్తిని లాక్కోవడానికి ఆమె వారిని కిరాతకంగా చంపినట్లు అప్పట్లో తెలిపారు. ఈ కేసు అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

వెలుగులోకి ఇలా..

జాలీ మొదటి భర్త రాయ్ థామస్ 2011లో చనిపోయారు. దీంతో అతని సోదరుడు రోజో థామస్ పోలీస్ అధికారులను కలిసి అనుమానాలు వ్యక్తం చేయటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

దీంతో తీగ లాగితే మొత్తం డొంక కదిలిందన్నట్టుగా.. గతంలో చేసిన హత్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. జాలీ షాజు మొదటిగా 2002లో తన మొదటి అత్త అన్నమ్మ థామస్‌ను భోజనంలో విషం పెట్టి చంపిందని ఆరోపణ ఉంది.. ఈ ఆరోపణ అటు ఉండగానే.. ఆరేళ్ల తర్వాత జాలీ మొదటి భర్త తండ్రి టామ్ థామస్ (66) కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయారు. అతనిపై సైనేడ్ ప్రయోగం జరిగినట్టు అనుమానాలు ఉన్నాయి. ఆ తర్వాత 2011లో జాలీ మొదటి భర్త రాయ్ థామస్ చనిపోయారు. మృతదేహానికి నిర్వహించిన శవపరీక్షలో సైనేడ్ ఆనవాళ్లను గుర్తించారు. కానీ దాని మీద దర్యాప్తు చేయలేదు.

అయితే.. తన మేనల్లుడి మృతదేహానికి రెండోసారి శవపరీక్ష జరపాలని 2014లో అన్నమ్మ సోదరుడు మాథ్యూ పట్టుపట్టారు. మరోవైపు 2016లో రాయ్ థామస్‌కి సోదరుడు వరస అయ్యే స్కారియా షాజు భార్య చనిపోవటంతో ఆ కుటుంబంలో ఆందోళన పెరిగింది. రెండేళ్ల తర్వాత 2018లో స్కారియా షాజు కూతురు ఆల్ఫైన్ కూడా చనిపోయింది. అనంతరం స్కారియా షాజును జాలీ పెళ్లి చేసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories