భారత్ లో వేగంగా వృద్ధాప్యం.. ఈ రాష్ట్రంలోనే..

భారత్ లో వేగంగా వృద్ధాప్యం.. ఈ రాష్ట్రంలోనే..
x
Highlights

గురువారం కేరళ రాష్ట్ర అసెంబ్లీలో ఎకనామిక్ రివ్యూ 2019 ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్.

గురువారం కేరళ రాష్ట్ర అసెంబ్లీలో ఎకనామిక్ రివ్యూ 2019 ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్. ఈ సందర్బంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మిగతా రాష్ట్రాలకంటే కేరళ రాష్ట్రం వృద్ధాప్యం చెందుతోందన్న విషయం ఈ ఎకనామిక్ రివ్యూ ద్వారా అర్ధమవుతోంది. 1961 లో, కేరళలో 60 ఏళ్ళు పైబడిన జనాభా 5.1 శాతం ఉంది.. అప్పట్లో ఇది జాతీయ స్థాయి 5.6 శాతానికి దిగువన ఉంది.

1980 నుండి, కేరళ మిగతా భారతదేశాన్ని అధిగమించింది.. 2001 లో వృద్ధాప్య జనాభా నిష్పత్తి 10.5 శాతానికి పెరిగింది, కానీ అప్పట్లో అఖిల భారత సగటు 7.5 శాతంగా ఉంది. 2011 నాటికి, కేరళ జనాభాలో 12.6 శాతం 60 సంవత్సరాలు దాటిన వారు ఉంటే అఖిల భారత సగటు 8.6 శాతంగా నమోదయింది. 2015 నాటికి, అఖిల భారత సగటు 8.3 శాతంతో పోలిస్తే కేరళలో 13.1 శాతానికి పెరిగిందని జనాభా డేటా (SRS స్టాటిస్టికల్ రిపోర్ట్ 2015) స్పష్టం చేసింది.

ప్రస్తుతం, కేరళలో 48 లక్షల మంది (2018 లో జనాభా అంచనా గణాంకాలు ఆధారంగా) 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు 15 శాతం మంది 80 ఏళ్లు దాటినవారు ఉన్నారు. ఇది పాత లెక్కలతో పోల్చుకుంటే ఎక్కువ అని ఎకనామిక్ రివ్యూ చెప్పింది. 60 ఏళ్ళు దాటిన వారిలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు.. వారిలో కూడా ఎక్కువ మంది వితంతువులు ఉన్నారు. SRS రిపోర్ట్ 2013-17 ప్రకారం 72.5 సంవత్సరాలు పురుషులకు ఉంటే.. ఆడవారికి 77.8 సంవత్సరాల యావరేజ్ వయస్సు ఉంది.

అధిక వృద్ధాప్య జనాభాకు కారణాలను ఎకనామిక్ రివ్యూ తెలియజేసింది ..'సాధారణంగా, అఖిల భారత స్థాయిలో పురుషుల కంటే మహిళల్లో ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది, అయితే, ఇది కేరళలో చాలా ఎక్కువ. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో సాధారణ మెరుగుదల సీనియర్ సిటిజన్ల జనాభా నిష్పత్తి నిరంతరం పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి.'

అంతేకాదు అధిక వయస్సు ఉన్న పురుషులు తక్కువ వయస్సు గల మహిళల్ని వివాహం చేసుకోవడం కూడా ఒక కారణం.. వితంతువులు అధికంగా ఉండటానికి మరొక కారణం.' అని పేర్కొంది. కాగా ఈ వృద్ధుల జనాభాలో 65 శాతం మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) 2015 చెప్పింది.

2011 ప్రకారం జనాభా లెక్కల కేరళలో వృద్ధాప్యంలో ఉన్న వితంతువులు.. 60-69 వయస్సు పరిధిలో 23 శాతం మంది ఉన్నారు.. 70 ఏళ్లు పైబడిన వారిలో ఇది 43.06 శాతంగా నమోదయింది. ఈ క్రమంలో కేరళ వృద్ధాప్యం మిగిలిన రాష్ట్రాల కంటే వేగంగా ఉందని ఎకనామిక్ రివ్యూ స్పష్టం చేసింది. 2025 నాటికి కేరళ జనాభాలో 20 శాతం మంది వృద్ధులు అవుతారని ఎకనామిక్ రివ్యూ తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories