ఉగ్రవాద సంస్ధ తుడిచిపెట్టుకుపోయింది : జమ్మూకశ్మీర్ డీజీపీ

ఉగ్రవాద సంస్ధ తుడిచిపెట్టుకుపోయింది : జమ్మూకశ్మీర్ డీజీపీ
x
Highlights

ఏజీహెచ్ ఉగ్రవాద సంస్ధ అంతమైపోయిందని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపారు. అన్సర్ ఘజ్వతుల్ హింద్ అనే ఉగ్ర సంస్థ స్థావరాలపై మంగళవారం అవంతిపొరాలో...

ఏజీహెచ్ ఉగ్రవాద సంస్ధ అంతమైపోయిందని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపారు. అన్సర్ ఘజ్వతుల్ హింద్ అనే ఉగ్ర సంస్థ స్థావరాలపై మంగళవారం అవంతిపొరాలో ఆసంస్ధ నాయకుడు హమీద్ లెల్హరీ మరో ఇద్దరిని మట్టుబెట్టింది.అయితే జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ మాట్లాడుతూ..అన్సర్ ఘజ్వతుల్ హింద్ ఉగ్రవాద సంస్ధ తుడిచిపెట్టుకుపోయినట్లేనని పేర్కొన్నారు



హమీద్ అల్ ఖైదాతో అనుబంధంగా పనిచేస్తున్నా ఏజీహెచ్ కు నాయకత్వం వహించాడని తెలిపారు. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైనా ముగ్గురు ఉగ్రవాదులు జైషే మహ్మద్ అనుబంధంగా పనిచేస్తున్నాయని చెప్పారు. 2016లో ఉగ్రకార్యకలాపాలు ప్రారంభించిన హమీద్ పలు దాడుల్లో కీలక పాత్ర పోషించాడని వివరించారు. జమ్మూకశ్మీర్ యువత తమకు సహకరిస్తే ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. ఇటీవలి కాలంలో యువత ఉగ్రవాదంలో చేరికలు తగ్గిపోయాయని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories