IRCTC Food ఆర్డర్ చేస్తున్నారా? అయితే ఈ రేట్లు తెలుసుకోవాల్సిందే! IRCTC లేటెస్ట్ మెనూ ధరల జాబితా ఇదిగో..

భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి IRCTC ఫుడ్ ప్రైస్ లిస్ట్ 2026. వందే భారత్, రాజధాని మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టీ, టిఫిన్, భోజనం ధరలు ఇక్కడ చూడండి.

santhoshi
Published on: 20 Jan 2026 4:52 PM IST
IRCTC Food ఆర్డర్ చేస్తున్నారా? అయితే ఈ రేట్లు తెలుసుకోవాల్సిందే! IRCTC లేటెస్ట్ మెనూ ధరల జాబితా ఇదిగో..
X

భారతీయ రైల్వేలో ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికులకు ఆహారం, పానీయాల ధరల విషయంలో తరచూ సందేహాలు వస్తుంటాయి. కొన్నిచోట్ల వెండర్లు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ప్రయాణికులు మోసపోకుండా ఉండేందుకు వందే భారత్, రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లతో పాటు మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో IRCTC నిర్ణయించిన అధికారిక ధరల పట్టికను ఇక్కడ అందిస్తున్నాం.

1. రాజధాని / శతాబ్ది / దురంతో ఎక్స్‌ప్రెస్ (1A/EC క్లాస్):

ప్రీమియం రైళ్లలో ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు ధరలు ఇలా ఉంటాయి:

ఉదయం టీ: రూ. 35

అల్పాహారం (Breakfast): రూ. 140

మధ్యాహ్నం/రాత్రి భోజనం: రూ. 245

సాయంత్రం టీ & స్నాక్స్: రూ. 140

2. రాజధాని / శతాబ్ది / దురంతో (2AC/3AC/CC క్లాస్):

ఉదయం టీ: రూ. 20

అల్పాహారం: రూ. 105

మధ్యాహ్నం/రాత్రి భోజనం: రూ. 185

సాయంత్రం టీ: రూ. 90

3. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express):

టీ/కాఫీ: రూ. 15 (EC & CC)

బ్రేక్ ఫాస్ట్: రూ. 155 (EC), రూ. 122 (CC)

భోజనం (Lunch/Dinner): రూ. 244 (EC)

సాయంత్రం స్నాక్స్: రూ. 105 (EC), రూ. 66 (CC)

4. మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సాధారణ ధరలు:

సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మొబైల్ యూనిట్లు (రైలులో అమ్మేవి), స్టాటిక్ యూనిట్లు (ప్లాట్‌ఫారమ్‌పై ఉండేవి) ధరల్లో స్వల్ప తేడా ఉంటుంది:

5. బిర్యానీ ప్రియుల కోసం (350 గ్రాములు):

వెజ్ బిర్యానీ: రూ. 80 (మొబైల్), రూ. 70 (స్టాటిక్)

ఎగ్ బిర్యానీ: రూ. 90 (మొబైల్), రూ. 80 (స్టాటిక్)

చికెన్ బిర్యానీ: రూ. 110 (మొబైల్), రూ. 100 (స్టాటిక్)

6. పానీయాలు & వాటర్ బాటిల్:

సాధారణ టీ (150 ml): రూ. 5

టీ బ్యాగ్ టీ / ఇన్స్టంట్ కాఫీ: రూ. 10

రైల్ నీర్ (1 లీటర్): రూ. 15

రైల్ నీర్ (500 ml): రూ. 10

ముఖ్య గమనిక:

రైల్వే నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే ప్రయాణికులు వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. బిల్లు అడగడం మర్చిపోకండి. 'నో బిల్ - నో పేమెంట్' (బిల్లు ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వక్కర్లేదు) అనే నిబంధనను రైల్వే అమలు చేస్తోంది.

santhoshi

santhoshi

Next Story