ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగితే బీజేపీకి మళ్లీ అధికారం, తగ్గనున్న కాంగ్రెస్ సీట్లు: ఇండియా టుడే- సీ ఓటర్ సర్వే

India Today Predicts BJP win if Elections Held
x

ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగితే బీజేపీకి మళ్లీ అధికారం, తగ్గనున్న కాంగ్రెస్ సీట్లు: ఇండియా టుడే- సీ ఓటర్ సర్వే

Highlights

దేశంలో ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ స్వంతంగానే సాధారణ మెజారిటీ సాధించనుంది.

దేశంలో ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ స్వంతంగానే సాధారణ మెజారిటీ సాధించనుంది. అంతేకాదు బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీ ఏ కూటమి 343 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో 232 సీట్లు గెలిచిన ఇండియా కూటమి 188 సీట్లకు పడిపోతోందని ఇండియూ టుడే - సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. 2025 జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ సర్వే నిర్వహించారు.

దేశంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 1,25,123 మందిని సర్వే చేశారు. తాజా సర్వే ప్రకారం ఎన్ డీ ఏ కూటమి ఓటు షేర్ మూడు శాతం పెరిగే అవకాశం ఉంది. ఇక ఇండియా కూటమి 1 శాతం ఓటు శాతం పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 281సీట్లు వస్తాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో 99 స్థానాలు దక్కాయి.

ఆ పార్టీ 99 స్థానాల నుంచి 78 స్థానాలకు పడిపోవచ్చని ఈ సర్వే తెలిపింది. బీజేపీకి గత ఎన్నికల్లో 41 శాతం ఓట్లు వచ్చాయి. అయితే అవి మరో 3 శాతం పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఓట్ల శాతం 20కి పడిపోయే ఛాన్స్ ఉంది. 2024 ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లను టార్గెట్ గా ఎన్ డీ ఏ బరిలోకి దిగింది. కానీ, ఆ పార్టీకి ఆశించిన స్థానాలు దక్కలేదు. బీజేపీకి కూడా సీట్లు తగ్గాయి. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్ నాయకత్వంలో జేడీ యూ మద్దతుతో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 400 సీట్లు ఎన్ డీ ఏకు రాలేదు. దీంతో విపక్షాలు అప్పట్లో మోదీ, బీజేపీపై విమర్శలు చేశాయి. దళిత, ఓబీసీ ఓట్లను కాంగ్రెస్ దూరం చేసింది.

ఆరు నెలల తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మహారాష్ట్ర, హర్యానా, దిల్లీలో బీజేపీ కూటమి విజయం సాధించింది. ఈ విజయాలు ఎన్ డీ ఏ కూటమికి రాజకీయంగా కలిసి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories